ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

28 Jun, 2018 17:24 IST|Sakshi
ఎయిరిండియా విమానం ( ఫైల్‌ ఫోటో)

సాక్షి,పట్నా: ఎయిరిండియా విమానానికి భారీ  ప్రమాదం తప్పింది. విమానానికి అకస్మాత్తుగా పక్షి అంతరాయం కల్పించడంతో అత్యవసరం లాండ్‌ చేయాల్సి వచ్చింది.  పట్నా ఎయిర్‌పోర్ట్‌లో  గురువారం ఈ సంఘటన చోటు  చేసుసుకుంది.  ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకుని సురక్షితంగా విమానం కిందికి దిగడంతో   ప్రయాణీకులు, సిబ్బంది  భారీ ఊరట చెందారు. దాదాపు 124 మంది ప్రయాణికులతో పట్నా - ఢిల్లీ ఎయిరిండియా విమానం ఈ భారీ ప్రమాదంనుంచి తప్పించుకుంది.  కాగా   కేవలం ఒక చిన్న పక్షి ఢీ కొనడం వలన పెద్ద పెద్ద విమానాలు కూలిపోయిన ఘటనలు గతంలో అనేకం చోటు  చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు