ఈ సారి సాఫీగా విమానయాన శాఖ మంత్రి భరోసా
న్యూఢిల్లీ: ఎయిరిండియా వాటా విక్రయం ఈ సారి సాఫీగా జరిగిపోనున్నదని విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ధీమా వ్యక్తం చేశారు. సంస్థను కొనేందుకు సత్తా గల కంపెనీలు మరింత ఆసక్తిగా ఉన్నాయని చెప్పారాయన. అందుకని ఎయిర్ ఇండియా వాటా విక్రయం విషయంలో ఈసారి ఎలాంటి సమస్యలు తలెత్తబోవన్నారు. భవిష్యత్తులో కూడా ఒక బ్రాండ్గా ఎయిరిండియా కొనసాగాలన్నదే ప్రభుత్వ అభిమతమన్నారు. ‘‘సంస్థ ఉద్యోగుల ప్రయో జనాలు పరిరక్షిస్తాం. కొన్నేళ్లుగా ఎలాంటి రిక్రూట్మెంట్లూ లేవు కనక మిగులు సిబ్బంది అనే సమస్య ఉండదు’’ అని చెప్పారాయన.