ఎయిర్‌ఏషియా ఇండియా 20 శాతం డిస్కౌంట్‌

16 Feb, 2019 00:38 IST|Sakshi

ఈ నెల 18 నుంచి బుకింగ్స్‌

అంతర్జాతీయ రూట్లకు కూడా వర్తింపు

ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ, ఎయిరేషియా ఇండియా విమాన టికెట్లపై 20 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. తమ విమాన సర్వీసులపైనా, ఎయిర్‌ఏషియా నెట్‌వర్క్‌ విమాన సర్వీసుల్లోనూ ఈ ఆఫర్లు వర్తిస్తాయని ఎయిరేషియా ఇండియా తెలిపింది. ఈ ఆఫర్లకు సంబంధించిన బుకింగ్స్‌ నెల 18 నుంచి ప్రారంభమవుతాయని, ఈ నెల 25 వరకూ అందుబాటులో ఉంటాయని కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సునీల్‌ భాస్కరన్‌ తెలిపారు.

ఈ డిస్కౌంట్‌ టికెట్లతో ఈ నెల 25 నుంచి జూలై 31 వరకూ ప్రయాణించవచ్చని వివరించారు. ఎయిర్‌ఏషియా అంతర్జాతీయ రూట్లలో కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొన్నారు. మన దేశానికి చెందిన టాటా గ్రూప్, మలేషియాకు చెందిన ఎయిరేషియా కలసి ఎయిర్‌ఏషియా ఇండియా జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీ 19 దేశీయ రూట్లలో, 20 ఎయిర్‌బస్‌ ఏ320లతో విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. కాగా,వెబ్‌సైట్‌ ద్వారాగానీ లేక యాప్‌ద్వారాకానీ టికెట్లను బుక్‌ చేసుకోవని ఎయిర్‌ఏషియా ఒక ప్రకటలో తెలిపింది.    

మరిన్ని వార్తలు