ఎయిర్ ఏషియా డిస్కౌంట్ ఆఫర్

24 Dec, 2015 09:00 IST|Sakshi
ఎయిర్ ఏషియా డిస్కౌంట్ ఆఫర్

హైదరాబాద్: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా.. క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రయాణికుల కోసం ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్ ఏషియా సంస్థ ఒకవైపునకు గానూ గోవా, కొచ్చి, గువాహతి, ఇంపాల్ వంటి ప్రాంతాలకు రూ. 1,269 నుంచి టికెట్లు ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కౌలాలంపూర్-బ్యాంకాక్‌కు రూ. 2,999 నుంచి టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. ఇప్పటి నుంచి జనవరి 3 వరకు బుకింగ్ చేసుకున్న వారు  జనవరి 10 నుంచి జూన్ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది.
 

>
మరిన్ని వార్తలు