జియోకు డైరెక్ట్‌ కౌంటర్‌: ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌

14 May, 2018 13:27 IST|Sakshi

సాక్షి, ముంబై: టెలికాం ఆపరేటర్‌ భారతి ఎయిర్‌టెల్‌ కొత్త  ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తాజాగా తీసుకొచ్చింది.  టెలికాం పరిశ్రమలోకి దూసుకొచ్చిన రిలయన్స్‌ జియో 149 రూపాయల ప్లాన్‌కు కౌంటర్‌గా  ఎయిర్‌టెల్‌ ఈ సరికొత్త ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. రూ.149 రూపాయల   ప్రీ పెయిడ్‌ ప్లాన్‌ లో రోజులు 1 జీబీ  డేటా  చొప్పున 28 జీబీ 3జీ/4జీ డేటాను అందిస్తున్నారు. దీంతో పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. వాలిడిటీ  28రోజులు. అయితే 28 రోజుల వాలిడిటీ ఉన్న జియో 149  రూపాయల ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తోంది.  
 

మరిన్ని వార్తలు