ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌ : 1200జీబీ డేటా

9 Apr, 2018 13:04 IST|Sakshi
భారతీ ఎయిర్‌టెల్‌ (ఫైల్‌ ఫోటో)

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ తన తొలి 300ఎంబీపీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను సోమవారం ఆవిష్కరించింది. నెలవారీ రెంటల్‌ రూ.2199తో ఈ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చింది. ఫైబర్‌-టూ-ది-హోమ్‌(ఎఫ్‌టీటీహెచ్‌) సర్వీసు సబ్‌స్క్రైబర్లను టార్గెట్‌గా చేసుకుని ఈ ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ స్పెషల్‌గా రూపొందించింది. ఈ కొత్త ప్లాన్‌ కింద 1200జీబీ ఆల్ట్రా హై స్పీడు డేటాను అపరిమిత ఎస్టీడీ, లోకల్‌ కాలింగ్‌ ప్రయోజనాలను అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది.  

ఈ కొత్త 300ఎంబీపీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను ఎంచుకునే ఎయిర్‌టెల్‌ సబ్‌స్క్రైబర్లకు, ఎయిర్‌టెల్‌ వింక్‌ మ్యూజిక్‌, ఎయిర్‌టెల్‌ టీవీ వంటి ఓటీటీ యాప్స్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ లభించనుంది. అంతేకాకుండా అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను యూజర్లు పొందనున్నారు. ఈ ప్లాన్‌ డేటా రోల్‌అవుట్‌ ప్రయోజనాలను, ఎయిర్‌టెల్‌ సర్‌ప్రైజ్‌, మైహోమ్‌ రివార్డులను అందించనుంది. అంతేకాకుండా 1టీబీ బోనస్‌ డేటా కూడా అక్టోబర్‌ 31 వరకు యూజర్లకు అందుబాటులో ఉండనుంది. ఇది కేవలం ఈ ప్లాన్‌ను ఆన్‌లైన్‌ కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే.

ఎంపిక చేసిన సర్కిళ్లకు మాత్రమే ఈ ప్లాన్‌ను అందుబాటులో ఉంచుతున్నామని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సైట్‌ను విజిట్‌ చేసి, సబ్‌స్క్రైబర్లు తమ సర్కిళ్లు ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవాలని సూచించింది. హై స్పీడు డేటా ఆశించే వారికి ఈ కొత్త ఎఫ్‌టీటీహెచ్‌ ఆధారిత ప్లాన్లను ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకంగా ఉందని భారతీ ఎయిర్‌టెల్‌ సీఈవో జార్జ్‌ మతేన్ అన్నారు. వచ్చే రోజుల్లో ఎఫ్‌టీటీహెచ్‌ ఆఫర్స్‌ను మరింత పెంచుతామన్నారు. 
 

మరిన్ని వార్తలు