ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

10 May, 2018 16:23 IST|Sakshi

సాక్షి, ముంబై: భారతీ ఎయిర్‌టెల్‌ తాజాగా కొత్త  డేటా ప్లాన్లను ప్రకటించింది.  ప్రీపెయిడ్‌ కస్టమర్లకోసం  ఈ కొత్త ప్రీపెయిడ్  రీఛార్జి ప్లాన్లతో ముందుకు వచ్చింది . టెలికాం కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం  రెండు ప్లాన్లను లాంచ్‌ చేసింది  .   రూ. 49 , రూ. 92 ప్లాన్లను ప్రారంభించింది.   అందుబాటు ధరలో,  హైస్పీడ్‌ డేటాను వినియోగదారులకు అందించే లక్ష్యంగా వీటిని ప్రారంభించింది.   

రూ.49  ప్యాక్ ప్రామాణికత ఒక రోజు.  ఇందులో 3జీబీ హై స్పీడ్‌ డేటా. మరొక ప్లాన్ రూ. 92  ప్యాక్‌ 7 రోజులపాటు చెల్లుబాటులో ఉంటుంది.  6జీబీ డేటా అందిస్తుంది.   ఈ రెండు ప్లాన్లలోనూ అధిక-వేగ డేటాను ఆఫర్ చేస్తుంది. డేటా వినియోగంపై రోజువారీ  నిబంధన ఏదీ లేదు. అంటే ఏడు రోజుల్లోనూ ఎపుడైనా 6జీబీ డేటా వాడు కోవచ్చు.

మరిన్ని వార్తలు