ఆ ఫోన్లపై ఎయిర్‌టెల్‌ రూ.2 వేల క్యాష్‌బాక్‌

23 Feb, 2018 16:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌’   ప్లాన్‌ ప్రచారంలో భాగంగా మోటరోలా, లెనోవా 4జీ స్మార్ట్‌ఫోన్లపై టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్‌ భారతీ ఎయిర్‌ టెల్‌ రూ.2 వేల క్యాష్‌బాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. మోటో సీ, మోటో ఈ4, లెనోవో కే8 నోట్‌ మొబైళ్లకు మాత్రమే ఈ క్యాష్‌బాక్‌ వర్తిస్తుంది. క్యాష్‌బాక్‌ ఆఫర్‌లో భాగంగా మోటో సీ మొబైల్‌ రూ.3,999 , మోటో ఈ4 మొబైల్‌ రూ.6,499, లెనోవో కే8 నోట్ రూ.10,999 లకే లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్లు అత్యంత దిగువస్థాయి కస్టమర్లకు కూడా లభ్యమయ్యేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు భారతీ ఎయిర్‌టెల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ వాణి వెంకటేశ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు