ఎయిర్‌టెల్‌ కొత్త ప్రిపెయిడ్‌ ప్లాన్‌

30 Apr, 2018 13:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ సరికొత్త ప్యాక్‌ను ప్రవేశపెట్టింది.  ముఖ్యంగా  రిలయన్స్ జియో భారతదేశంలో  టాప్‌ టెలికాం ఆపరేటర్‌గా  దూసుకుపోతున్నతరుణంలో జియోను నిలువరించే ప్లాన్లలో భాగంగా ఈ  కొత్త ఆఫర్‌ తీసుకొచ్చింది.  ఈ క్రమంలోనే డేటా టారిఫ్‌ప్లాన్లనుంచి తన ఫోకస్‌ను హలో ట్యూన్స్‌ సెగ్మెంట్‌ వైపు మళ్లించింది.   ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో ఉచిత  డేటా,  వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో పాటు ఉచిత హలో ట్యూన్లను  కూడా అందిస్తుంది.  ఇటీవల  ప్రకటించిన రూ.219 ప్లాన్‌ తరహాలోనే మరో కొత్త ప్రీపెయిడ్‌​ రీచార్జ్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది.


టెలికాం టాక్ నివేదిక ప్రకారం రూ. 129 రీఛార్జ్ కొత్త ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఇందులో  అన్‌లిమిటెడ్‌కాలింగ్‌ , రోజుకు  1జీబీ 4 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.  దీనికి అదనంగా  ఎయిర్‌టెల్‌ హలో ట్యూన్స్‌ను ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది.  ఈ ప్లాన్‌ 28 రోజులు వాలిడిటీ. అయితే ఈ ఆఫర్‌ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మరిన్ని వార్తలు