ఆంపియర్ మాగ్నస్ ప్రో : కొత్త ఇ-స్కూటర్

15 Jun, 2020 15:41 IST|Sakshi

మాగ్నస్ ప్రో  ధర రూ .73,990 (ఎక్స్-షోరూమ్) 

సాక్షి, ముంబై: గ్రీవ్స్ కాటన్ కు చెందిన ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సరికొత్త ఇ-స్కూటర్ లాంచ్ చేసింది. రూ .73,990 (ఎక్స్-షోరూమ్) ధర వద్ద  మాగ్నస్ ప్రో పేరుతో దీన్ని విడుదల చేసింది.  ప్రస్తుతం బెంగళూరు మార్కెట్లో లభిస్తుందనీ, త్వరలో దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. కొత్త ఇ-స్కూటర్‌ను కంపెనీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

యాంటీ-తెఫ్ట్ అలారం, డిజిటల్ ఎల్‌సీడీ క్లస్టర్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, బ్రైట్ ఎల్‌ఇడి లైట్లు, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు (పగటిపూట రన్నింగ్ లాంప్స్), టెలిస్కోపిక్ సస్పెన్షన్, 450 ఎంఎం లెగ్ స్పేస్,  భారీ స్టోరేజ్ బూట్ స్పేస్ , ఛార్జీకి సగటున 75-80 కిలోమీటర్ల మైలేజీలాంటి  మెయిన్ ఫీచర్లను ఇందులో జోడించింది. 

హై-స్పీడ్ ఇ-స్కూటర్ విభాగంలో మాగ్నస్ ప్రో సౌకర్యవంతమైన, భద్రతా లక్షణాలతో సౌలభ్యంగా లిష్ ఫీచర్లతో ఆకట్టుకుంటుందని ఆంపియర్ ఎలక్ట్రిక్ సీవోవో సంజీవ్ చెప్పారు. కోవిడ్-19 తరువాత వ్యక్తిగత వాహనాల వైపు మొగ్గు పెరిగిన నేపథ్యంలో ఈ కొత్త మాగ్నస్ ఇ-స్కూటర్ ప్రారంభించడం ఒక ముఖ్యమైన మైలురాయి అని కంపెనీ సీఎండీ నాగేష్ బసవన హళ్లి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు