ఆనంద్‌ మహీంద్ర సారీ చెప్పారా? ఎందుకు?

26 Dec, 2017 19:15 IST|Sakshi

సాక్షి, ముంబై:  మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్ర బైక్‌ లవర్స్‌కు "క్రిస్మస్ బహుమతి"  ప్రకటించారు. ఎం అండ్‌ ఎండ్‌ బ్రాండ్‌ బీఎస్‌ఏ నుంచి ఒక కొత్త మోటార్‌ సైకిల్‌  తీసుకొస్తున్నట్టు ట్విట్టర్‌  ద్వారా వెల్లడించారు.   సారీ.. ఇన్ని సంవత్సరాలు   మీ ఫావరెట్‌ రైడ్‌ను మిస్‌ అయ్యారు శాంటా.. కానీ  ఈసారి కొత్త షైనీ  మోటార్‌ సైకిల్‌ తీసుకొస్తున్నామంటూ  ట్వీట్‌ చేశారు.  దీంతోపాటు  శాంటా  బీఎస్‌ఏ  మోటార్‌ సైకిల్‌ నడుపుతున్న  ఒక ఫోటోను  కూడా జతచేశారు.

అయితే ఈ  కొత్త వెహికల్‌   విడుదల తేదీ, టైం  ఇంకా నిర్ధారించపోయినప్పటికీ,  రాయల్‌ఎన్‌ఫీల్డ్‌, బజాజ్‌ వాహనాలకు భిన్నంగా  బీఎస్‌ఏ  వాహన లవర్స్‌కు మాత్రం ఇది శుభవార్తే.
 

కాగా   2016 అక్టోబర్‌లో  ఎం అండ్‌ ఎం అనుబంధ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ యూకేకు  చెందిన  మోటార్‌ సైకిల్ సంస్థ బీఎస్‌ఏ ను సొంతం చేసుకుంది.   మార్కెట్‌ లీడర్‌ రాయల్‌  ఎన్‌ఫీల్డ్‌కు దడపుట్టించేలా  నూతన లాంచ్‌లతో ముంచెత్తింది. అయితే గత ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో  ఎం అండ్‌ ఎం టూవీలర్స్‌ లిమిటెడ్‌  రూ.471కోట్ల నష్టాలను ప్రకటించింది.

మరిన్ని వార్తలు