వేదాంత డైరెక్టర్‌గా అనిల్‌ అగర్వాల్‌

30 Mar, 2020 05:06 IST|Sakshi
అనిల్‌ అగర్వాల్‌

న్యూఢిల్లీ: మైనింగ్‌ మ్యాగ్నెట్‌ అనిల్‌ అగర్వాల్‌.. వేదాంత కంపెనీలో తొలిసారిగా డైరెక్టర్‌గా నియమితులయ్యారు. లండన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేదాంత రిసోర్సెస్‌కు అధినేతగా అనిల్‌ అగర్వాల్‌ వ్యవహరిస్తున్నారు. అనిల్‌ అగర్వాల్‌(66)ను నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమించామని వేదాంత లిమిటెడ్‌ తెలిపింది. ఇప్పటివరకూ ఈ బాధ్యతలను అనిల్‌ అగర్వాల్‌ సోదరుడు నవీన్‌ నిర్వర్తించారని, ఇప్పటి నుంచి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌గా నవీన్‌ వ్యవహరిస్తారని పేర్కొంది. కంపెనీ సీఈఓ ఎస్‌. వెంకటకృష్ణన్‌ రాజీనామా చేయడంతో ఈ మార్పులు జరిగాయని వివరించింది. మరోపక్క, హిందుస్తాన్‌ జింక్‌కు హెడ్‌గా ఉన్న సునీల్‌ దుగ్గల్‌ను  వేదాంత సీఈఓగా నియమించామని తెలిపింది.   

మరిన్ని వార్తలు