మలేసియా హాస్పిటల్స్‌తో అపోలో జట్టు

24 Nov, 2015 02:12 IST|Sakshi
మలేసియా హాస్పిటల్స్‌తో అపోలో జట్టు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మలేిసియాలోని చక్కెర వ్యాధిగ్రస్తులకు సేవలను అందించడానికి అపోలో హాస్పిటల్స్ ముందుకొచ్చింది. ఇందుకోసం అపోలో గ్రూపు అనుబంధ కంపెనీ అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్(ఏహెచ్‌ఎల్‌ఎల్) మలేసియాకు చెందిన రామ్సే సిమే డార్బీ హెల్త్‌కేర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం రామ్సే హాస్పిటల్‌లోని రోగుల చికిత్సకు అపోలో తన అనుభవాన్ని అందిస్తుంది. ఇంకా మలేసియా, ఇతర సరిహద్దు దేశాల్లో హాస్పిటల్స్ విస్తరణ కూడా చేపట్టనున్నారు. అపోలో 100 హాస్పిటల్స్ ద్వారా సుమారు రెండు లక్షల మంది డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందిస్తోంది.
 
 

మరిన్ని వార్తలు