బాటానగర్‌లో అపోలో వైద్య కళాశాల

3 Dec, 2014 01:05 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ పశ్చిమ బెంగాల్‌లోని బాటానగర్‌లో వైద్య కళాశాల, ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇందుకు సంస్థ రూ.400 కోట్లు వ్యయం చేస్తోంది. 14 ఎకరాల స్థలాన్ని అక్కడి ప్రభుత్వం అపోలోకు ఉచితంగా ఇచ్చింది. తొలి దశ నిర్మాణం 2017 నాటికి పూర్తి అవుతుందని గ్రూప్ తూర్పు ప్రాంత సీఈవో రూపాలి బసు తెలిపారు. వైద్యులు, నర్స్‌లు, ఇతర విభాగాల్లో కలిపి 6 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నారు. ఇప్పటికే అపోలోకు హైదరాబాద్‌లో వైద్య కశాశాల ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు