ఆపిల్‌ ఈవెంట్‌ : బిగ్‌ ప్రైస్‌, బిగ్‌ స్క్రీన్‌

12 Sep, 2018 14:21 IST|Sakshi

కొత్త ఫోన్ల లాంచింగ్‌పై భారీ అంచనాలు

భారీస్క్రీన్‌,  బిగ్‌ప్రైస్‌ తో మూడు  ఐ ఫోన్లు

ఫోర్త్‌ జనరేషన్‌ ఆపిల్‌  వాచ్‌

ట్రిలియన్‌ డాలర్లను అధిగమించిన కంపెనీ మార్కెట్‌ క్యాప్‌

కొత్త కొత్త ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు విపరీతంగా ఆకట్టుకుంటున్న ఆపిల్‌ లేటెస్ట్‌ ఈవెంట్‌ చర్చనీయాంశంగా మారింది. తాజాగా  ఆపిల్ మరో సెప్సేషనల్‌  ఈవెంట్‌కు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందులో యాపిల్ మూడు కొత్త ఐఫోన్లు లాంచ్‌ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఐఫోన్ ఎక్స్‌సీ (ఐఫోన్), ఐఫోన్ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్ ఎక్స్‌ఎస్‌ మ్యాక్స్‌ను ఈ రోజు రాత్రి రిలీజ్‌  చేయనుందనే అంచనాలు భారీగా హల్‌ చల్‌ చేస్తున్నాయి. అంతేకాదు ఈసారి ఐఫోన్ల  బిగ్‌ స్క్రీన్‌, బిగ్‌ ప్రైస్‌ తో రానున్నాయని అంచనా. మరోవైపు  రెవెన్యూ వృద్ధితో ఆపిల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్లను ( సుమారు 7లక్షల 23వేల కోట్లు రూపాయలు) ను అధిగమించింది.

ఐ ఫోన్‌ ఎక్స్‌ ప్లస్‌ లేదా మాక్స్‌ :  టాప్‌ మోడల్‌గా తీసుకొస్తున్న ఐఫోన్ ఎక్స్ఎస్ ప్లస్‌ 6.5 అంగుళాల ఓలెడ్ స్క్రీన్‌ అమర్చింది. ధర సుమారు రూ.75,000

ఐఫోన్ ఎక్స్ఎస్‌ ‌: 6.1 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో రానుంది. దీని ధర సుమారు  రూ. 71,000 ఉండనుంది. 

ఐఫోన్ ఎక్స్‌సీ :  5.8 అంగుళాల ఓలెడ్ స్క్రీన్‌.  ఐఫోన్ ఎక్స్‌సీ ధర రూ.57,000గా ఉండొచ్చని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వీటితో పాటు యాపిల్ ఐప్యాడ్ ప్రో మోడల్స్‌ని కూడా లాంఛ్ చేయనుందట. ఈఈవెంట్‌లో సరికొత్త మ్యాక్ లైనప్‌ కూడా లాంఛ్ కానుందని మరో ప్రచారం జరుగుతోంది. మ్యాక్ బుక్, మ్యాక్ బుక్ ప్రో, ఐమ్యాక్‌తో పాటు మ్యాక్ మినీ కూడా ఉండొచ్చు. డిస్‌ప్లే పెర్ఫామెన్స్‌లో అప్‌గ్రేడ్స్ చాలా ఉంటాయని టెక్ నిపుణులు అంచనా. అలాగే ఆపిల్‌ వాచ్‌ సిరీస్లో ఫోర్త్‌ జనరేషన్‌ వాచ్‌ను కూడా రిలీజ్‌ చేయనున్నట్టు సమాచారం.  అయితే ఈ అంచనాలపై ఆపిల్‌ నుంచి అధికారికి సమాచారం ఏదీ అందుబాటులో లేదు.

మరిన్ని వార్తలు