మాల్యాకు షాక్‌: అరెస్ట్‌ వారెంట్‌

19 Jan, 2018 08:54 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: వేలకోట్ల రూపాయల ఎగవేతదారుడు, వ్యాపారవేత్త విజయ్‌మాల్యాపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కేసులో  బెంగళూరులోని కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కోర్టు  మాల్యాతోపాటు  మరో 18మందికి ఈ వారెంట్‌ ఇష్యూ చేసింది.  సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఐఎఫ్ఓఓ) దాఖలు చేసిన ఫిర్యాదుపై  విచారణ చేపట్టిన  కోర్టు ఈ  చర్య తీసుకుంది.

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని దర్యాప్తు సంస్థ, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు  సంబంధించి పలు కంపెనీల చట్టాల ఉల్లంఘనలను గుర్తించింది. దీంతోపాటు తీవ్రమైన కార్పొరేట్ పాలన లోపాలు ఉన్నట్లు  సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో చోటుచేసుకున్న  అక్రమాల మొత్తం భారీగా ఉండటంతో  మాల్యా సహా అందరి నిందితులపై కోర్టు సీరియస్‌గా స్పందించింది.  ఈ  నేపథ్యంలోనే కంపెనీల చట్టాల ప్రకారం డిఫాల్టర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా, మరో 18 మందికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంతేకాకుండా, 19 సంస్థలపై "ప్రత్యేక నేర కేసు" నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ తమ చార్జ్‌షీటులను దాఖలు చేశాయి.

కాగా 9వేలకోట్ల రూపాయల మేర రుణాలను   ఎగవేసిన మాల్యా  లండన్‌కు పారిపోగా.. ఆయన్ను తిరిగి భారత్‌కు రప్పించేందుకు సంబంధించిన కేసు  లండన్‌ కోర్టు విచారణలో  ఉంది.

మరిన్ని వార్తలు