ఎయిర్ ఇండియా సీఎండీగా అశ్వని లొహాని

1 Sep, 2015 01:30 IST|Sakshi
ఎయిర్ ఇండియా సీఎండీగా అశ్వని లొహాని

న్యూఢిల్లీ: రైల్వే సర్వీస్ అధికారి అశ్వని లొహాని దేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన 1980 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ అధికారి. అశ్వని లొహాని మూడేళ్లపాటు ఎయిర్ ఇండియా సీఎండీగా కొనసాగనున్నారు. ఈయనకు ముందు ఎయిర్ ఇండియా సీఎండీగా ఉన్న రోహిత్ నందన్ ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.

మరిన్ని వార్తలు