భారీ విజయంతో ఆసీస్‌ బోణీ

28 Nov, 2017 00:38 IST|Sakshi

తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై  10 వికెట్లతో గెలుపు

బ్రిస్బేన్‌: తమకెంతో కలిసొచ్చిన బ్రిస్బేన్‌ మైదానంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు అజేయ రికార్డును కొనసాగించింది. ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఓవర్‌నైట్‌ స్కోరు 114/0తో ఆట చివరిరోజు సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా 16 ఓవర్లు ఆడి విజయానికి అవసరమైన 56 పరుగులను సాధించింది. ఓపెనర్లు వార్నర్‌ (119 బంతుల్లో 87 నాటౌట్‌; 10 ఫోర్లు), బాంక్రాఫ్ట్‌ (182 బంతుల్లో 82 నాటౌట్‌; 10 ఫోర్లు, ఒక సిక్స్‌) తొలి వికెట్‌కు 173 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించి ఆసీస్‌ విజయాన్ని ఖాయం చేశారు. ఓవరాల్‌గా బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాకిది 22వ విజయం. రెండో టెస్టు డిసెంబర్‌ 2 నుంచి అడిలైడ్‌లో జరుగుతుంది. 

మరిన్ని వార్తలు