పీఎం కేర్స్‌కు బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 10 కోట్లు

25 Apr, 2020 05:20 IST|Sakshi

ముంబై: కరోనా వైరస్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎంకేర్స్‌ అనే ప్రత్యేక నిధికి బజాజ్‌ ఫిన్‌సర్వ్, ఆ సంస్థ ఉద్యోగులు సంయుక్తంగా రూ.10.15 కోట్ల విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి.  కరోనా వైరస్‌ నివారణకు రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు గతంలోనే బజాజ్‌ గ్రూపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఎంఆర్‌ఎఫ్‌ రూ.25 కోట్లు: ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్‌ఎఫ్‌ సైతం కరోనా వైరస్‌ నివారణ చర్యలకు మద్దతుగా రూ.25 కోట్లను ప్రకటించింది.

కోల్‌ ఇండియా రూ.221 కోట్లు: ప్రభుత్వరంగ సంస్థ కోల్‌ ఇండియా కరోనా వైరస్‌ నివారణ కోసం భూరీ విరాళాన్ని ప్రకటించింది. పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.221 కోట్లను అందించినట్టు తెలిపింది.  

మరిన్ని వార్తలు