మూడో రోజూ లాభాల జోష్‌..

11 Jun, 2019 16:58 IST|Sakshi

ముంబై : అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు గ్లోబల్‌ మార్కెట్లలో జోష్‌ నింపాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో పాటు బ్యాంక్‌, మెటల్‌ షేర్లలో కొనుగోళ్లతో స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 166 పాయింట్ల లాభంతో 39,950 పాయింట్ల వద్ద ముగియగా,  43 పాయింట్ల లాభపడిన నిఫ్టీ 11,965 పాయింట్ల వద్ద ముగిసింది. టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, వేదాంత షేర్లు లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు