-

తెలంగాణకు రూ. కోటి విలువైన వ్యాక్సిన్లు

9 Apr, 2018 02:57 IST|Sakshi

ఉచితంగా ఇవ్వనున్న భారత్‌ బయోటెక్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బయోటెక్నాలజీ కంపెనీ భారత్‌ బయోటెక్‌ నూతన లోగోను ఆవిష్కరించింది. దేశీయంగా నూతన మాలిక్యూల్స్‌ను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నం కానున్నట్టు వెల్లడించింది. రూ.1 కోటి విలువైన వ్యాక్సిన్లను తెలంగాణ ప్రభుత్వ టీకా కార్యక్రమానికి ఉచితంగా ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన లెటర్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావుకు కంపెనీ సీఎండీ కృష్ణ ఎల్లా అందజేశారు.    

మరిన్ని వార్తలు