బీహెచ్ఈఎల్కు రూ.109 కోట్ల లాభం

9 Nov, 2016 02:12 IST|Sakshi
బీహెచ్ఈఎల్కు రూ.109 కోట్ల లాభం

చెన్నై: పవర్ ఎక్విప్‌మెంట్‌లో అగ్రగామి కంపెనీ అరుున ప్రభుత్వ రంగ బీహెచ్‌ఈఎల్ సెస్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.109 కోట్ల లాభాన్ని గడించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.181 కోట్ల మేర నష్టాలను నమోదు చేయడం గమనార్హం. మొత్తం ఆదాయం రూ.6,860 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ.6,314 కోట్లకం టే 9 శాతం వృద్ధి చెందింది.

కంపెనీకి చెందిన అన్ని విభాగాల్లోనూ వృద్ధి నెలకొంది. విద్యుత్ విభాగం ఆదాయం 10.5 శాతం పెరిగి రూ.5,254 కోట్లుగా నమోదైంది. ఇబిటా రూ.155 కోట్లుగా ఉండగా... గతేడాది ఇదే కాలంలో ఇది రూ.438 కోట్ల నష్టంగా ఉండడం గమనార్హం.  సెప్టెంబర్ చివరి నాటికి  ఆర్డర్ బుక్ విలువ రూ.1.03 లక్షల కోట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

మరిన్ని వార్తలు