ఫ్లిప్‌కార్ట్‌ దివాలీ సేల్‌ : స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు

1 Nov, 2018 12:41 IST|Sakshi

సాక్షి, ముంబై: రానున్న దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దివాలీసేల్‌ను ప్రారంభించింది. నేటి (గురువారం,నవంబరు 1) నుంచి అయిదురోజుల పాటు నవంబరు 5 దాకా వివిధ ఉత్సత్తులపై భారీ  డిస్కౌంట్‌ను ప్రకటించింది. ముఖ్యంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. అలాగే ఎస్‌బీఐ   క్రెడిట్‌ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై అదనంగా 10శాతం తగ్గింపు.  రెడ్‌మి నోట్‌ 5 ప్రొ, పోకో ఎఫ్‌ 1, పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్లను తగ్గింపు ధరల్లో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.

రెడ్‌మి నోట్‌ 5 ప్రొ : 2 వేల రూపాయల తగ్గింపుతో రూ. 12,999 లకే లభ్యం. 
పోకో ఎఫ్‌1: షావోమి సబ్‌బ్రాండ్‌ తీసుకొచ్చిన పోకో ఎఫ్‌1 (6జీబీ/128 జీబీ స్టోరేజ్‌) పై 3వేల రూపాయల డిస్కౌంట్‌. రూ.21.999లకు అందుబాటులో ఉంది. పోకో ఎఫ్‌ 1 (8జీబీ/1256 జీబీ స్టోరేజ్‌)  4వేల  రూపాయల తగ్గింపు అనంతరం  రూ.26,999 లభిస్తోంది. 
గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ ఎల్‌: రూ. 5499 డిస్కౌంట్‌తో  40,999లకే అందిస్తోంది. దీనికి అదనంగా ఎస్‌బీఐకార్డుపై 10శాతం డిస్కౌంట్‌ కలుపుకుని ఈ సేల్‌ లో ఫ్లిప్‌కార్ట్‌ రూ. 36,999ల​కే అందిస్తోంది.  
హానర్  9 ఎన్‌: 4వేల రూపాయల తగ్గింపుతో  9999 రూపాయలకు లభ్యం.

వీటితోపాటు హానర్‌10, ఆసుస్‌జెన్‌ ఫోన్లపై కూడా డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇంకా టీవీలు, ఎలక్రానిక్స్‌ ఉత్పత్తులు, ఫర్నిచర్‌పై  80శాతంగా దాకా తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తోంది 

మరిన్ని వార్తలు