ఫేక్‌కాల్స్‌ నియంత్రణకు  బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ 

4 May, 2019 01:15 IST|Sakshi

అందుబాటులోకి తెచ్చిన టెక్‌ మహీంద్రా  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ టెక్‌ మహీంద్రా తాజాగా టెలికం విభాగంలో బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఫేక్‌ కాల్స్, మెసేజ్‌లను నియంత్రించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని, 30 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని కంపెనీ తెలియజేసింది.

గతేడాది బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేశామని, 25 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నామని కంపెనీ గ్లోబల్‌ ప్రాక్టీస్‌ లీడర్‌ రాజేశ్‌ దుడ్డు గురువారమిక్కడ ఓ కార్యక్రమంలో చెప్పారు. టెలికంతో పాటు తయారీ, ఆర్ధిక, హైటెక్‌ రంగాల్లోనూ బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతను అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంక్‌కు ఆడిట్‌ లావాదేవీల నిర్వహణకు  

మరిన్ని వార్తలు