మార్కెట్లకు నేడు సెలవు 

12 Nov, 2019 08:40 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ  స్టాక్‌మార్కెట్లకు నేడు (మంగళవారం) సెలవు. గురునానక్‌ జయంతి సందర్భంగా  మార్కెట్లు పనిచేయవు. గురు నానక్  550 జయంతి సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) , నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఇ) నవంబర్ 12 న మూసివేయబడతాయి. బులియన్‌తో సహా, ఫారెక్స్ ,  కమోడిటీ ఫ్యూచర్ మార్కెట్లలో కూడా వాణిజ్య కార్యకలాపాలు ఉండవు. బుధవారం తిరిగి  యధాతథంగా  పనిచేస్తాయి.  కాగా   నిన్న (నవంబర్ 11)  సెన్సెక్స్ 21.47 పాయింట్ల స్వల్ప లాభంతో 40,345.08 వద్ద ముగియగా, నిఫ్టీ 5.30 పాయింట్లు పెరిగి 11,913.50 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు