బీఎస్‌ఎన్‌ఎల్ స్పెషల్ ఈద్ ప్రీపెయిడ్ ప్లాన్‌

25 May, 2020 10:26 IST|Sakshi

ఈద్ స్పెషల్ ప్రీపెయిడ్ ప్లాన్ : రూ. 786  వాలిడిటీ 90 రోజులు

రూ .699 ప్లాన్‌ వాలిడిటీ 160 రోజులు

సాక్షి. ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ  భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్)  తన వినియోగదారుల కోసం స్పెషల్ ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. ముఖ్యంగా  రూ.786  ప్లాన్ ను ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రత్యేకంగా తీసుకొచ్చింది.

ఈద్ సందర్భంగా ముస్లింలు పవిత్ర సంఖ్యగా భావించే  786  నంబరుతో ఈ ప్లాన్ తీసుకు రావడం విశేషం.  ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులు మాత్రమే. సంస్థ ఆవిష్కరించిన మరో ప్లాన్ ధర 699 రూపాయలు. వీటితో పాటు కంపెనీ  ఇప్పటికే ఎస్‌టివి 118, కాంబో 18 ప్రీపెయిడ్ ప్లాన్‌లనుతీసుకొచ్చింది ఈ ప్లాన్లు అన్ని సర్కిల్‌లలో అందుబాటులో ఉన్నాయి.  లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుండి, బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకోసం  ఇటీవల చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

రూ .786 ఈద్  స్పెషల్  ప్లాన్ : రూ. 786 టాక్‌టైమ్‌, మొత్తం 30జీబీ  హై స్పీడ్ డేటా లభ్యం. ఈ ప్లాన్‌ 90 రోజుల చెల్లుబాటులోవుంటుంది.  2020 జూన్ 21 వరకు  రీఛార్జ్ చేసుకోవచ్చు.
రూ .699 ప్రీపెయిడ్ ప్లాన్:  ఈద్ స్పెషల్ ప్లాన్‌తో పాటు, బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా విడుదల చేసింది.  మొత్తం 500 ఎమ్‌బి డేటాతో పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాలింగ్ సదుపాయం, రోజుకు 100ఎస్ఎంఎస్ లు లభ్యం. ఇది 160 రోజుల చెల్లుబాటులో వుంటుంది. అలాగే స్పెషల్ పెర్సనలైజ్డ్ రింగ్‌బ్యాక్ టోన్‌ కూడా వుంది.
బీఎస్ఎన్ఎల్ కాంబో 18 డేటా ప్లాన్: కాంబో 18 ప్రీపెయిడ్ ప్లాన్ : రెండు రోజులుతో స్వల్పకాలిక ప్రణాళిక. ఈ ప్రణాళిక పుదుచ్చేరి, లక్ష్వదీప్ సహా 22 సర్కిళ్లలో లభిస్తుంది.  30 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తుంది. డేటా  లిమిట్ అయిపోయిన తర్వాత వేగం 80 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఇతర నెట్‌వర్క్‌లకు 250 నిమిషాల వరకు ఉచిత కాలింగ్ సదుపాయం.

మరిన్ని వార్తలు