నేడు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల నిరాహార దీక్ష

25 Nov, 2019 05:08 IST|Sakshi

న్యూఢిల్లీ: తప్పనిసరిగా స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) ఎంచుకునేలా కింది స్థాయి సిబ్బందిని యాజమాన్యం భయాందోళనలకు గురి చేస్తోందంటూ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ నవంబర్‌ 25న (నేడు) దేశవ్యాప్తంగా నిరాహార దీక్షకు దిగనున్నట్లు సంస్థ ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. వీఆర్‌ఎస్‌ తీసుకోని వారి రిటైర్మెంట్‌ వయస్సును 58 ఏళ్లకు తగ్గించేస్తామంటూ, దూర ప్రాంతాల్లో పోస్టింగ్స్‌ ఇస్తామంటూ మేనేజ్‌మెంట్‌ బెదిరిస్తోందని ఆలిండియా యూనియన్స్‌ అండ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ (ఏయూఏబీ) కనీ్వనర్‌ పి. అభిమన్యు ఆరోపించారు.  

మరిన్ని వార్తలు