బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ప్రీ పెయిడ్‌ ప్లాన్‌

14 Feb, 2018 21:31 IST|Sakshi
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌

సాక్షి, ముంబై : టెలికాం రంగంలో నెలకొన్న తీవ్ర పోటీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ప్రీ పెయిడ్‌ ప్లాన్‌ను ప్రకటించింది. రూ.999తో రీచార్జ్‌ చేసుకుంటే ఒక ఏడాది పాటు రోజుకు ఒక జీబీ డేటా, ఆరు నెలల పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ వినియోగించుకోవచ్చు.

డేటా పరిమితి దాటిన తర్వాత 40 కేబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ వస్తుంది. ఇక ప్రతిరోజూ 100 ఎస్సెమెస్‌లు ఉచితంగా లభిస్తాయి. తాజా ఆఫర్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌  జియో, ఎయిర్‌టెల్‌లకు సవాలు విసిరినట్లే.

మరిన్ని వార్తలు