బీఎస్‌ఎన్‌ఎల్‌ రిపబ్లిక్‌ డే ఆఫర్‌

25 Jan, 2019 19:00 IST|Sakshi


సాక్షి, ముంబై:   గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం సరికొత్త కాంబో ఎస్టీవీని ప్రకటించింది. ఎస్టీవీ-269 పేరుతో  ఒక ప్యాక్‌ను లాంచ్‌  చేసింది.  ఈ ప్యాక్‌లో ఏ నెట్‌వర్క్‌కు అయినా 2600 నిమిషాల టాక్‌టైం, 260 మెసేజ్‌లు, 2.6 జీబీ డేటా వంటి ప్రయోజనాలను అందిస్తోంది. ప్లాన్‌ వాలిడిటీ 26 రోజులు.

దేశవ్యాప్తంగా ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు ఈ ప్యాక్ అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ వెల్లడించింది. 70వ రిపబ్లిక్‌ డే సందర్భంగా వినియోగదారులకు  శుభాకాంక్షలు అందిస్తూ  బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర‍్మన్‌, ఎండీ అనుపమ శ్రీవాస్తవ మీడియా ప్రకటన జారీ చేశారు. 

మరిన్ని వార్తలు