రిలయన్స్‌ జియోకి బీఎస్‌ఎన్‌ఎల్‌ కౌంటర్‌

17 Mar, 2017 01:14 IST|Sakshi
రిలయన్స్‌ జియోకి బీఎస్‌ఎన్‌ఎల్‌ కౌంటర్‌

రూ.339కే రోజుకు 2జీబీ డేటా, ఫ్రీకాలింగ్‌
రిలయన్స్‌ జియోకి బీఎస్‌ఎన్‌ఎల్‌ కౌంటర్‌


న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ  బీఎస్‌ఎన్‌ఎల్‌ తాజాగా తన కొత్త ఆఫర్‌తో రిలయన్స్‌ జియోకి షాకిచ్చింది. ఇది  రూ.339లతో సరికొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఇందులో కస్టమర్లు రోజుకు 2 జీబీ 3జీ డేటాను పొందొచ్చని కంపెనీ పేర్కొంది. అలాగే సొంత నెట్‌వర్క్‌లో అపరిమితంగా మాట్లాడుకోవచ్చని తెలిపింది. అలాగే ఇతర నెట్‌వర్క్‌ యూజర్లతో రోజుకు 25 నిమిషాలు ఉచితంగా మాట్లాడుకోవచ్చని, తర్వాత కాల్‌ చార్జీలు నిమిషానికి 25 పైసలుగా ఉంటాయని వివరించింది.

రూ.339ల కొత్త స్పెషల్‌ టారిఫ్‌ వోచర్‌ (ఎస్‌టీవీ) వాలిడిటీ 28 రోజులని పేర్కొంది. తాజా ఆఫర్‌ కేవలం 90 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. కాగా రిలయన్స్‌ జియో రోజుకు 1 జీబీ 4జీ డేటాను ఉచితంగా ఇస్తోంది. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్‌ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు