ముంబై : స్టాక్ మార్కెట్ల దూకుడు కొనసాగుతోంది. ఐటీ, పీఎస్యూ సహా పలు రంగాల షేర్లలో కొనుగోళ్లతో బుధవారం స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. కొనుగోళ్ల జోరుతో బీఎస్ఈ సెన్సెక్స్ 40,000 పాయింట్ల ఎగువన నిలదొక్కుకుంది. సానుకూల త్రైమాసిక ఫలితాలతో పాటు డివిడెండ్ డిస్ర్ట్రిబ్యూషన్ ట్యాక్స్ను రద్దు చేస్తారనే అంచనాలు ఇన్వెస్టర్లలో సానుకూల సంకేతాలను పంపాయి. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 220 పాయింట్ల లాభంతో 40,051 పాయింట్ల వద్ద ముగియగా, 57 పాయింట్లు పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,844 పాయింట్ల వద్ద క్లోజయింది.