భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

18 Dec, 2019 16:18 IST|Sakshi

ముంబై : ఐటీ, మెటల్‌ షేర్లలో కొనుగోళ్లతో స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. టాటా గ్రూప్‌ చీఫ్‌గా సైరస్‌ మిస్త్రీ పునర్నియామకంపై ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులతో టాటా గ్రూప్‌ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఆర్‌ఐఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, మహింద్రా అండ్‌ మహింద్రా షేర్లు భారీగా లాభపడ్డాయి. కొనుగోళ్ల జోరుతో కీలక సూచీలు రికార్డు హైలను టచ్‌ చేశాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 206 పాయింట్ల లాభంతో 41,558 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 12,221 పాయింట్ల వద్ద క్లోజయింది.

మరిన్ని వార్తలు