46శాతం క్షీణించిన మొత్తం చెల్లింపులు
కరోనా వైరస్ ప్రేరిత లాక్డౌన్ ప్రభావం కరెన్సీ నోట్లపై పడింది. లాక్డౌన్ విధింపు నేపథ్యంలో ఈ ఏప్రిల్లో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ సగానికి పైగా తగ్గింది. దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంల నుంచి ఈ ఏప్రిల్లో రూ.1.27లక్షల కోట్ల నగదును మాత్రమే ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. అంతకు ముందు నెల మార్చిలో ఏటీఎంల ద్వారా రూ.2.51లక్షల కోట్ల ఉపసంహరణ జరిగినట్లు తెలుస్తోంది. మార్చిలో కంటే ఏప్రిల్లో పాయింట్ ఆఫ్ సేల్ వద్ద నగదు విత్డ్రా వాల్యూమ్స్ స్వల్పంగా పెరిగాయి. ఈ ఏప్రిల్లో పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) నుంచి రూ.110 కోట్ల నగదు ఉపసంరణ జరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు తెలిపాయి. ప్రజలు నిత్యావసర కొనుగోళ్లకు అత్యధికంగా డిజిటల్ చెల్లింపులకే మొగ్గుచూపారు.