ప్రధాని మోడీతో టాటా గ్రూప్ చైర్మన్ మిస్త్రీ భేటీ

14 Jun, 2014 01:16 IST|Sakshi
ప్రధాని మోడీతో టాటా గ్రూప్ చైర్మన్ మిస్త్రీ భేటీ

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఈ సమావేశం సుహృద్భావపూర్వకంగా జరిగిందేనని అధికార వర్గాలు తెలిపాయి. గత నెల 26న మోడీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టాటా గ్రూప్ గౌరవాధ్యక్షుడు రతన్ టాటాతో పాటు మిస్త్రీని కూడా ఆహ్వానించారు. అయితే విదేశీ పర్యటనలో ఉన్నందున వారిరువురూ రాలేకపోయారు.

>
మరిన్ని వార్తలు