రాజన్కు షికాగో యూనివర్సిటీ ఆహ్వానం

25 Jun, 2016 01:59 IST|Sakshi
రాజన్కు షికాగో యూనివర్సిటీ ఆహ్వానం

వాషింగ్టన్: విద్యా బోధనకు తిరిగి రావాలని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను ప్రతిష్ఠాత్మక షికాగో యూనివర్సిటీ ఆహ్వానించింది. ఆయనకు ఉన్న అపార అనుభవం యూనివర్సిటీకి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని వర్సిటీ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ సునీల్ కుమార్ చెప్పారు. సెప్టెంబర్ 4న తన మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకోనున్న రాజన్, ఆ తరవాత విద్యాబోధన వైపు వెళతానని చెప్పారు. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేసిన రాజన్‌కు... అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై విశేష అవగాహన ఉంది. ఈయన 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించారు.

మరిన్ని వార్తలు