డయాబెటిక్ రోగులకు బైద్యనాథ్ షుగర్-ఫ్రీ ‘చ్యవన్-విట్’

16 Nov, 2015 01:26 IST|Sakshi
డయాబెటిక్ రోగులకు బైద్యనాథ్ షుగర్-ఫ్రీ ‘చ్యవన్-విట్’

హైదరాబాద్: శ్రీ బైద్యనాథ్ ఆయుర్వేద్ భవన్ కంపెనీ తొలిసారిగా డయాబెటి క్ రోగుల కోసం షుగర్-ఫ్రీ ‘చ్యవన్-విట్’ ఔషధాన్ని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. బైద్యనాథ్ చ్యవన్-విట్ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందని, ఇతర బలహీనతలను తగ్గిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బైద్యనాథ్ రీసెర్చ్ పౌండేషన్ నిర్వహించిన పలు పరిశోధనల అనంతరం బలహీనతలను తగ్గించే బిల్వా, డాష్‌మూల్ వంటి ఫాస్పేట్ అధికంగా కలిగిన మూలికలను కలిపి ఈ చ్యవన్-విట్‌ను తయారుచేశామని పేర్కొంది.

చ్యవన్-విట్‌లోని ఆశగంధ, సేఫ్డ్ ముసలి, కేశర్ వంటి మూలికలు నరాలను ఉత్తేజితం చేసి, తద్వారా శారీరక బలహీనతలను తగ్గిస్తాయని కంపెనీ వివరించింది.

మరిన్ని వార్తలు