షేర్‌ బాజార్‌లో బాలీవుడ్‌ తారల సందడి

25 Sep, 2018 17:03 IST|Sakshi

సాక్షి, ముంబై:  స్టాక్‌మార్కెట్‌లో  లాభాల షేర్లతోపాటు బాలీవుడ్‌ తారలు మెరుపులు మెరిపించారు   నష్టాలతో​ ప్రారంభమై లాభాల హై జంప్‌  చేసిన మంగళవారం నాటి షేర్‌ బాజార్‌ ముగింపు సమయంలో  బీఎస్‌ఈ ఇండియా కార్యాలయంలో  అప్‌కమింగ్‌ బాలీవుడ్‌  మూవీ  బాజార్‌ యూనిట్‌ సందడి  చేసింది.  బీఎస్‌ఈ ఇండియా ఎంఈ సీఈవో ఆశిష్‌ చౌహాన్‌తోపాటు , నిఖిల్‌అద్వానీ, చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన   హీరో  సైఫ్ అలీఖాన్ చిత్రంగ‌దా సింగ్, రాధికా ఆప్టే, రోహ‌న్ మెహ్ర  మార్కెట్‌ ముగింపునకు సంకేతంగా స్టాక్‌మార్కెట్‌   బెల్‌ మెగించారు.  దీంతోపాటు బాజార్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.  

 కాగా ఈ మూవీ ద్వారా వినోద్ మెహ్రె కుమారుడు రోహ‌న్ మెహ్ర బాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతుండగా, ఎమ్మే ఎంట‌ర్ టైన్మెంట్, కైతా ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న ఈ మూవీకి గౌర‌వ్ కె చావ్లా ద‌ర్శ‌కుడుగా ఉన్నారు. త్వరలోనే  బాజార్‌ విడుదలకు చిత్ర యూనిట్‌ సిద్ధమవుతోంది

మరిన్ని వార్తలు