డెక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు డీఆర్‌టీ ఆదేశాలు

29 Jun, 2013 05:36 IST|Sakshi
డెక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు డీఆర్‌టీ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్: తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైఎస్ చైర్మన్ అయ్యర్‌లకు చెందిన ఐదు ఆస్తుల ఆటాచ్‌మెంట్ కోసం రుణ వసూళ్ల ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. యాక్సిస్ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.427 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో, ఆ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన డీఆర్‌టీ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్, బంజారాహిల్స్,రోడ్ నెంబర్ 12లో వెంకట్రామిరెడ్డికి చెందిన 1,050 చదరపు గజాల స్థలం, అదే రోడ్డులో ఉన్న పెంటగాన్ ఎక్స్‌టెన్షన్‌లో ఉన్న 1,350 చదరపు అడుగుల ప్లాట్, వైస్ చైర్మన్ అయ్యర్‌కు అదే ప్రాంతంలోని సాయిలక్ష్మీ ఎన్‌క్లేవ్ ఉన్న 1,200 చదరపు అడుగుల ప్లాట్, 925 గజాల స్థలం, మధురానగర్‌లో ఉన్న 800 చదరపు గజాల స్థలం అటాచ్‌మెంట్‌కు డీఆర్‌టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవచ్చునని యాక్సిస్ బ్యాంకుకు డీఆర్‌టీ స్పష్టం చేసింది.

>
మరిన్ని వార్తలు