ఢిల్లీ మెట్రోలో ఒకే రోజు 26 లక్షల మంది ప్రయాణం..

22 Jul, 2014 19:39 IST|Sakshi
ఢిల్లీ మెట్రోలో ఒకే రోజు 26 లక్షల మంది ప్రయాణం..
న్యూఢిల్లీ: ఒకే రోజు అత్యధిక మంది ప్రయాణీకులను తరలించిన ఓ రికార్డును ఢిల్లీ మెట్రో రైలు సొంతం చేసుకుంది. జూలై 21 తేదిన 26 లక్షల మంది ప్యాసింజర్లను ఢిల్లీ మెట్రో తరలించింది.  
 
జూలై 21 తేదిన 26,84,132 మంది ప్యాసింజర్లు ప్రయాణించారని డిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ (డీఎమ్ఆర్సీ) తెలిపింది. గత సంవత్సరం ఆగస్టు 19న  26,50,635 ప్రయాణించారని డీఎమ్ఆర్సీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
మరిన్ని వార్తలు