జియోతో సావన్‌ జట్టు 

24 Mar, 2018 01:23 IST|Sakshi

న్యూఢిల్లీ: దాదాపు 1 బిలియన్‌ డాలర్ల పైగా విలువ చేసే డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫాం నెలకొల్పే దిశగా జియో మ్యూజిక్, డిజిటల్‌ మ్యూజిక్‌ సేవల సంస్థ సావన్‌ చేతులు కలిపాయి. దేశీయంగా మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ మార్కెట్లో ఈ భాగస్వామ్యం జియో–సావన్‌ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు తోడ్పడగలదని రిలయన్స్‌ జియో (ఆర్‌జియో) డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ డీల్‌కి సంబంధించి జియోమ్యూజిక్‌ విలువ 670 మిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టారు. ఒప్పందం ప్రకారం డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫాంపై రిలయన్స్‌ 100 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనుంది.  

మరిన్ని వార్తలు