2021కి ఈ–కామర్స్‌ 55 బిలియన్‌ డాలర్లు!

16 Feb, 2017 01:27 IST|Sakshi
2021కి ఈ–కామర్స్‌ 55 బిలియన్‌ డాలర్లు!

ముంబై: ఈ–కామర్స్‌ మార్కెట్‌ 2021 నాటికి 50–55 బిలియన్‌ డాలర్లకి చేరుతుందని అంచనా. ప్రస్తుతం మార్కెట్‌ విలువ 6–8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌లు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డిజిటలైజేషన్‌ పెరిగే కొద్ది ఈ–కామర్స్‌లో కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్, దుస్తులు, గృహోపకరణాలు, ఫుడ్‌ అండ్‌ గ్రాసరీ, ఎఫ్‌ఎంసీజీ వంటి తదితర విభాగాల జోరు పెరుగుతుందని నివేదిక పేర్కొంది. 2025 నాటికి ఈ–కామర్స్‌ రంగంలో కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ విస్తరణ గరిష్టంగా 38–42% శ్రేణిలో ఉండొచ్చని తెలిపింది. 

మరిన్ని వార్తలు