బడ్జెట్ అంచనాల్లో 37.5%కి చేరిన ద్రవ్యలోటు

1 Jul, 2015 00:27 IST|Sakshi

న్యూఢిల్లీ: దవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా మొత్తంలో ఏప్రిల్-మే నెలల్లోనే 37.5 శాతానికి పరిమితమయ్యింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం- చేసే వ్యయం మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఈ లోటు రూ.5.55 లక్షల కోట్లు ఉండాలని బడ్జెట్ నిర్దేశించింది. ఈ లక్ష్యంలో ఏప్రిల్-మే నెలల్లో లోటు 2.08 లక్షల కోట్లకు చేరిందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన తాజా గణాంకాలు తెలిపాయి. గడచిన ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో ఈ రెండు నెలల్లోనే ద్రవ్యలోటు 45.3 శాతానికి చేరింది.

మరిన్ని వార్తలు