న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద థర్డ్ పార్టీ వెబ్ బ్రౌజర్ అయిన ‘యూసీ బ్రౌజర్’ భారత మార్కెట్లో తన కార్యకలాపాలను పెంచుకునే దిశగా వ్యూహాన్ని మార్చుకుంటోంది. భారత వినియోగదారులకు ఇన్యాప్ క్లౌడ్ స్టోరేజీ సేవలను ‘యూసీ డ్రైవ్’ రూపంలో ఆఫర్ చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. భారీ క్లౌడ్ స్టోరేజీ సదుపాయంతో ఉచితంగా దీన్ని అందిస్తున్నట్టు తెలిపింది.