స్వీట్స్‌ ‘గడువు తేదీ’ ప్రదర్శించాల్సిందే

26 Feb, 2020 08:01 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇప్పటి వరకు ప్యాక్‌ చేసిన స్వీట్స్‌కు మాత్రమే గడువు తేదీతోపాటు తయారీ తేదీని ఉత్పత్తిదార్లు ముద్రిస్తున్నారు. ఇక నుంచి సాధారణ స్వీట్‌ షాపుల్లో కూడా విడిగా విక్రయించే తీపి పదార్థాల ముందు ఈ తేదీలను ప్రదర్శించాల్సిందే. 2020 జూన్‌ 1 నుంచి ఈ నిబంధనను అమలులోకి తీసుకొస్తున్నట్టు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) స్పష్టం చేసింది. గడువు ముగిసిన తీపి పదార్థాలను దుకాణదార్లు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిబంధన అమలు చేయాల్సిందిగా ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది.

మరిన్ని వార్తలు