గో ఎయిర్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌

13 Apr, 2019 16:46 IST|Sakshi

సాక్షి, ముంబై: బడ్జెట్‌ ధరల విమానయాన సంస్థ  గో ఎయిర్‌ తక్కువ ధరల్లో దేశీయ విమాన  టికెట్లను ప్రకటించింది. పరిమిత కాల ఆఫర్‌గా తీసుకొస్తున్న ఈ ఆఫర్‌లో  రూ.1375 (అన్నీ కలుపుకొని)  ప్రారంభ ధరగా  టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఏప్రిల్‌ 17 వరకు  టికెట్ల కొనుగోలుకు అవకాశం ఉంది. ఇలా బుక్‌  చేసుకున్న టికెట్ల ద్వారా  ప్రయాణించేందకు గడువు జూన్‌ 2019తో ముగియనుంది. అహ్మదాబాద్‌- బెంగళూరు, బెంగళూరు-పట్నా, కోలక్తతా-ముంబై, కోలకతా-పుణే తదితర మార్గాల్లో ఈ డిస్కౌంట్లు రేట్లు వర్తిస్తాయని గో ఎయిర్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. 

>
మరిన్ని వార్తలు