ఈ నెల 8 నుంచీ మళ్లీ పసిడి బాండ్లు

5 Mar, 2016 00:15 IST|Sakshi
ఈ నెల 8 నుంచీ మళ్లీ పసిడి బాండ్లు

న్యూఢిల్లీ: పసిడి బాండ్ల పథకం మూడవ విడతకు వచ్చే మంగళవారం నాడు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే...

బాండ్లకు దరఖాస్తులను మార్చి 8వ తేదీ నుంచీ 14వ తేదీవరకూ సమీకరిస్తారు.   మార్చి 29న బాండ్లను జారీ చేస్తారు.
బ్యాంకులు, స్టాక్  హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్), గుర్తింపు పొందిన పోస్టాఫీసుల్లో బాండ్ల విక్రయం జరుగుతుంది.
సావరిన్ గోల్డ్ బాండ్లపై మొత్తాలను తిరిగి చెల్లించే సమయంలో వ్యక్తులకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని 2016-17 బడ్జెట్ ప్రతిపాదిస్తోంది.
5, 10, 50, 100 గ్రాములు డినామినేషన్లలో 5-7 ఏళ్ల కాలానికి బాండ్లు జారీ అవుతాయి.
ఒక వ్యక్తి వార్షికంగా 500 గ్రాములకన్నా అధికంగా బాండ్ల కొనుగోలుకు అవకాశం లేదు.
పెట్టుబడుల సమయంలో మెటల్ విలువ ప్రాతిపదికన వడ్డీరేటును లెక్కిస్తారు.
తొలి విడత స్కీమ్‌లో 916 కేజీల పరిమాణంలో బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.246 కోట్లు సమీకరించింది.
రెండో విడతలో ఇది 3,071 కేజీలకు చేరింది. తద్వారా రూ.798 కోట్లు ప్రభుత్వం సమీకరించింది.

మరిన్ని వార్తలు