వరుసగా 6వ రోజూ దిగి వచ్చిన బంగారం
గురువారం రూ.360 పడిపోయింది
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు గురువారం మరింత పతనమయ్యాయి. బులియన్ మార్కెట్లో వరుసగా 6వ రోజు కూడా బలహీన పడిన 10 గ్రాముల బంగారం ధర ఈ రోజు రూ.360లు క్షీణించింది. 10గ్రా. పసిడి ధర 33,070 రూపాయలు పలుకుతోంది. వెండి ధర రూ. 520 పతనమై కిలో రూ. 38,980 గా ఉంది.
దేశ రాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారంధర రూ. 33,070 , 99.5 శాతం ప్యూరిటీ గోల్డ్ ధర రూ. 32,900గా ఉంది. మరోవైపు అంతర్జాతీయంగా స్పాట్ బంగారం ఔన్స్ ధర 1,284.77 డాలర్లుగా ఉంది. అదేవిధంగా వెండి న్యూయార్క్లో ఒక ఔన్స్15.06 డాలర్లు స్థాయికి పడిపోయింది.
విదేశీ బలహీన ధోరణి , స్థానిక నగల వర్తకులనుంచి డిమాండ్ క్షీణించడం దేశీయ మార్కెట్లో పుత్తడి ధరలు పడిపోయాయని వర్తకులు తెలిపారు. అలాగే డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బలపడుతూ వుండటం కూడా పసిడి ధరలపై ఒత్తడి పెంచినట్టు అంచనావేశారు.