పెరిగిన బంగారం ధర

29 Jun, 2020 10:43 IST|Sakshi

అంతర్జాతీయంగా 10డాలర్లు జంప్‌

కలిసొచ్చిన ఈక్విటీల పతనం

దేశీయ మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజ్‌లో సోమవారం ఉదయం బంగారం ధర పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు సంఖ్య కోటి దాటడంతో పాటు 5 లక్షల మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ పట్ల ఇన్వెస్టర్లకు సందేహాలు తలెత్తి తమ పెట్టుబడులను బంగారంలోకి మళ్లించారు. అలాగే ఈక్విటీ సూచీల భారీ పతనం, అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ పెరగడం, రూపాయి స్థిరమైన ట్రేడింగ్‌... తదితర అంశాలు బంగారానికి డిమాండ్‌ను పెంచినట్లు బులియన్‌ పండితులు చెబుతున్నారు. ఉదయం 10గంటలకు 10గ్రాముల బంగారం ధర శుక్రవారం ముగింపు(రూ.48305)తో పోలిస్తే రూ.115లు పెరిగి రూ.48420 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

అంతర్జాతీయంగా 10డాలర్లు జంప్‌:
అంతర్జాతీయంగా బంగారం ధర 10డాలర్లు పెరిగింది. నేడు ఆసియాలో ఉదయం సెషన్‌లో 10గ్రాముల బంగారం ధర శుక్రవారం ముగింపు(రూ.1780)తో పోలిస్తే 10డాలర్లు పెరిగి 1,790డాలర్లు వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌ జెరోమ్ పావెల్‌తో పాటు ఆర్థికమంత్రి స్టీవెన్ మునుచిన్‌ ఆర్థికవ్యవస్థ అవుట్‌లుక్‌, ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ తదుపరి చర్యలపై రేపు (మం‍గళవారం) హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ ముందు ప్రసగించున్నారు. ఈ అంశంపై కూడా బులియన్‌ ట్రేడర్లు దృష్టిని సారించారు.

మరిన్ని వార్తలు