ఇండస్ఇండ్ బ్యాంకు రూ.30 కోట్ల విరాళం

16 Apr, 2020 14:45 IST|Sakshi
ఫైల్ ఫోటో

గోల్డ్‌మెన్‌ శాక్స్‌ సింగపూర్‌  41 లక్షల షేర్ల కొనుగోలు

లాభాల్లో ఇండస్ఇండ్  బ్యాంకు షేరు 

 కోవిడ్ -19  కట్టడికి. 30 కోట్ల విరాళం

సాక్షి, ముంబై: అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్‌మెన్‌ శాక్స్‌ సింగపూర్‌ అనుబంధ సంస్థ పీటీఈ-ఒడిఐ(ఆఫ్‌షోర్‌ డెరివేటివ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌) ప్రయివేటు రంగ  దిగ్గజబ్యాంకు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో 0.65 శాతం వాటా కొనుగోలు చేసింది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా ఒక్కో షేరు సగటున రూ.430 చొప్పున మొత్తం 4.1 మిలియన్‌ (41 లక్షల) షేర్లను కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ విలువ 176 కోట్ల రూపాయలు. గోల్డ్‌మెన్‌ శాక్స్‌ అనుబంధ సంస్థ వాటా కొనుగోలుతో  ఇవాళ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ జోరుమీదుంది. గురువారం  ప్రారంభలో షేర్ ధర 4శాతానికి పైగా లాభపడింది. గత 3 రోజుల్లో షేర్‌ 8.47 శాతం పెరగడం విశేషం. 

ఓపెన్‌ మార్కెట్లో గోల్డ్‌మెన్‌ శాక్స్‌ అనుబంధ సంస్థ వాటా కొనుగోలుతో ఇవాళ ఇంట్రాడేలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 4శాతం పైగా లాభపడింది. గత నెల 20న ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయి రూ.235.55కుపడిపోయిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఆ తర్వాత కోలుకుంది. కనిష్ట స్థాయి వద్ద లభించిన కొనుగోళ్ళ మద్దతుతో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 87శాతం లాభపడింది. కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో అనేక రాష్ట్రాలలో, జాతీయ స్థాయిలో ప్రభుత్వం , దాని ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నట్లు ఇండస్ఇండ్ బ్యాంక్  ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం  రూ .30 కోట్ల విరాళమిస్తున్నట్టు వెల్లడించింది. కరోనా వైరస్  విస్తరణ, తదితర పరిణామాలను, అవసరాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పింది. 

మరిన్ని వార్తలు