ఎంఐ అభిమానుల అయిదేళ్ల ప్రేమకు భారీ బహుమతి
రూ.500 ఎంఐ ఫాన్స్కు రిటన్ గిఫ్ట్
64 ఎంపీ, నాలుగు కెమెరాలతో మరో స్మార్ట్ఫోన్
అక్టోబర్ 16న లాంచింగ్
సాక్షి, ముంబై : భారతదేశంలో నంబర్వన్ స్మార్ట్ఫోన్ బ్రాండ్గా ఎదిగిన షావోమి తన దూకుడును కొనసాగిస్తోంది. బిగ్ స్ర్కీన్, బిగ్బ్యాటరీ, ఏఐ కెమెరాలు అంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్న షావోమి తాజాగా ఎంఐ ఫ్యాన్స్కు మరో గుడ్న్యూస్ అందించింది. బుధవారం రెడ్మి 8 లాంచింగ్ సందర్బంగా స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు షావోమి ఎండీ మను కుమార్ జైన్. అలాగే 64ఎంపీ క్వాడ్ కెమెరా(4) లతో మరో (రెడ్మి నోట్ 8 ప్రొ ) స్మార్ట్ఫోన్ లాంచ్ చేయబోతున్నట్టు చెప్పారు. ఈ నెల 16నే దీన్ని ఆవిష్కరించనున్నామని తెలిపారు.
రూ. 5కోట్ల రిటర్న్ గిఫ్ట్ ఆఫర్
గత ఐదేళ్లుగా కాలంగా కస్టమర్లు తమపై చూపించిన ప్రేమకు ప్రతిఫలంగా రూ. 500 కోట్లను తిరిగి వారికి ఇచ్చేస్తున్నట్టు షావోమి ఎండీ మనుకుమార్ జైన్ ప్రకటించారు. తొలి 50 లక్షల వినియోగదారులకు 4జీబీ వేరియంట్ అప్డేట్ను ఉచితంగా అందిస్తామని తెలిపారు. 50 లక్షల రెడ్మి8 కొనుగోలుదారులకు రూ. 1000 విలువ (రూ. 5 కోట్లు) గల అప్డేట్ను ఉచితంగా అందిస్తుందన్నమాట.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పండుగ సీజన్లో కేవలం 7రోజుల్లో 5.3 మిలియన్ల స్మార్ట్ఫోన్ల విక్రయాలు నమోదయ్యాయని ప్రకటించారు. అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎంఐ దీపావళి సేల్లో నిమిషానికి 525 డివైస్లు అమ్మినట్టు తెలిపారు. షావోమిపై వినియోగదారుల అసాధారణ ప్రేమ ఎప్పటికే ఇలాగే కొనసాగాలని మనుకుమార్ ఆశించారు. ఈ సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రెడ్మి నోట్ 8 ప్రో ఫీచర్లు
6.53 అంగుళాల డిస్ప్లే, 64 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ 120-డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2ఎంపీ మాక్రో కెమెరాతో క్వాడ్-కెమెరా సెటప్ను కలిగి ఉంది. అలాగే 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 18వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, క్విక్ ఛార్జ్ 3.0 లకు మద్దతుగా 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్సి సపోర్ట్, యుఎస్బి టైప్-సి పోర్ట్,ఎంఐయుఐ 10.0.1.3 ఆధారిత ఆండ్రాయిడ్ పై 9 ప్రధాన ఫీచర్లు. ధర రూ. సుమారు 14,000. దీన్నిఇప్పటికే చైనా మార్కెట్లో లాంచ్ చేసింది.
Mi fans, for all the love you have given us over the last 5 years, we're giving back ₹500 Cr.
The first 5 million fans will get the #Redmi8, #4GB64GB variant for ₹7,999 & people who order 3GB variant will get upgraded to a 4GB variant.Thank you! pic.twitter.com/jsOJgZcRzM
— Redmi India for #MiFans (@RedmiIndia) October 9, 2019
Excited to share the biggest news that we've sold 5.3mn+ #Xiaomi devices in last 7 days.
— Mi India for #MiFans (@XiaomiIndia) October 5, 2019
That makes a whopping 525 devices sold every minute since the start of @amazonIN @Flipkart #DiwaliWithMi sale. Ur love for #Xiao️mi has been phenomenal as always.
Thank you, Mi fans! ❤️ pic.twitter.com/wXVZ95VM2H